సికింద్రాబాద్ పేరు మార్పు..? మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు..

1 month ago 8
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ప్రాంతం పేరును మార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. దీనిలో భాగంగానే నార్త్ జోన్ కార్యాలయాన్ని, పోలీస్ విభాగాలను మల్కాజ్‌గిరిలో కలిపారని విమర్శించారు. రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి గాంధీ విగ్రహం వరకు 'ఆత్మగౌరవ ర్యాలీ' నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటి నుండి ఒకరు ఈ పోరాటంలో పాల్గొని సికింద్రాబాద్ ఉనికిని చాటాలని కోరారు.
Read Entire Article