తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 వేదికను ప్రజలు సందర్శించేందుకు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు ఉచితంగా ప్రవేశం కల్పించారు. నగర ప్రజలు లింగ బేధం లేకుండా ఈ సమ్మిట్ను వీక్షించవచ్చు. దీనిలో భాగంగా.. బుధవారం నాడు 12 ప్రభుత్వ కళాశాలల నుంచి 4,800 మంది విద్యార్థులు సందర్శించనున్నారు. విద్యార్థులను తరలించడానికి 52 ఆర్టీసీ బస్సులను ఉపయోగించనున్నారు. అయితే, సామాన్య ప్రజలకు సమ్మిట్ వేదిక వరకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం లేదని అధికారులు స్పష్టం చేశారు.