పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువు పంపిణీని ప్రభుత్వం వేగవంతం చేసింది. గోదావరి బేసిన్ నుంచి పూడూరు ప్లాంట్ ద్వారా గ్యాస్ను తీసుకుని ఇళ్లకు సరఫరా చేసేందుకు భాగ్యనగర్, మెగాసిటీ గ్యాస్ ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి. పైప్లైన్ల నిర్మాణానికి 24 గంటల్లోనే వాట్సప్ ద్వారా అనుమతులు ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.