తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి 20 ఏళ్ల పొలిటికల్ జర్నీ పూర్తి చేసుకున్న సందర్భంగా ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. మిడ్జిల్లో రేవంత్ రెడ్డిగా మొదలై.. ప్రజల గుండెల్లో రేవంతన్నగా నిలవడం తన జీవితంలో అద్భుత అధ్యాయమన్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని తాను 2006 జులై 4న తొలిసారి జడ్పీటీసీగా గెలిచిన మిడ్జిల్ మండలంలో ఇవాళ నిర్వహించబోయే కృతజ్ఞత వందన సభకు ముఖ్యమంత్రి హోదాలో హాజరై ప్రజలకు ధన్యవాదాలు తెలపడంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.