ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణకు హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు ఇది సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యేనని మండిపడ్డారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రుల గొడవలను కప్పిపుచ్చుకోవడానికే తనను విచారణకు పిలిచారని.. అసలు విషయాలు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లను విచారిస్తేనే తెలుస్తాయని అన్నారు.