సోషల్ మీడియాలో వీలునామా, మరణ వాంగ్మూలంతో మాజీ డీఎస్పీ నళిని చేసిన పోస్ట్.. తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో.. తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో.. యాదాద్రి కలెక్టర్ ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి.. ఆమెకు అన్ని రకాల సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సర్వీసు పరమైన సమస్యలు, ఆరోగ్య పరిస్థితి, చికిత్సకు సంబంధించి.. అన్నీ ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు.