దీపావళి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా దంపతులు భేటీ అయ్యారు. కొండా దంపతుల కుమార్తె కొండా సుస్మిత పటేల్ ఇటీవల సీఎం రేవంత్ సహా పలువురు సీనియర్ మంత్రులపై సంచలన ఆరోపణలు చేసిన వేళ.. ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. తమ కుటుంబాన్ని రాజకీయంగా అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని.. రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని కొండా సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఓఎస్డీ అరెస్ట్ విషయంలో తలెత్తిన హైడ్రామా నేపథ్యంలో.. సుస్మిత వ్యాఖ్యలపై కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డికి వివరణ ఇచ్చినట్లు సమాచారం.