తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తో ఫిల్మ్ సిటీ ఏర్పాటుపై చర్చించారు. అత్యాధునిక AI, VFX స్టూడియోల ఏర్పాటుకు అజయ్ ఆసక్తి చూపారు. కపిల్ దేవ్ తో కలిసి హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం చర్చించారు. ఈ రెండు ప్రాజెక్టులు తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని భావిస్తున్నారు.