మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంగారెడ్డిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విధుల్లో ఉన్న ఓ సీఐ.. కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకున్నట్లు ఆరోపణలు రావడం పెను దుమారానికి కారణం అయింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ రిగ్గింగ్కు సీఐ సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన జగ్గారెడ్డి.. సీఐని సస్పెండ్ చేయకపోతే.. ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరికలు చేశారు.