హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ టాస్క్ఫోర్స్ విభాగంలో భారీ ప్రక్షాళన చేపట్టారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సుమారు 80 మంది సిబ్బందిని ఒకేసారి బదిలీ చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. కొన్నేళ్లుగా ఒకే చోట పాతుకుపోయిన అధికారులను మార్చడం ద్వారా విభాగంలో పారదర్శకత తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు.. నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ఆయన ప్రజలను హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులు వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.