కేసీఆర్ ఆస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. 2004 ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తనకు భూమి లేదని పేర్కొన్నారని చెబుతూ.. ఆ తర్వాతి కాలంలో ఆయన కుటుంబానికి భారీగా భూములు, ఆస్తులు ఎలా సమకూరాయని ప్రశ్నించారు. ప్రభుత్వ, పేదలు, దళితుల అసైన్డ్ భూముల విషయంలో బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయని కూడా పొంగులేటి ఆరోపించారు. కేసీఆర్కు పుట్టుకతోనే వందల ఎకరాలు ఉన్నాయని చెబుతున్న కేటీఆర్.. ఎన్నికల అఫిడవిట్లోని వివరాలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.