సూర్యాపేటలో ఇద్దరు అమ్మాయిలు హాస్టల్ గోడ దూకిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మహాత్మా జ్యోతిబా పూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ వద్ద ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి సమయంలో హాస్టల్ గోడ దూకిన అమ్మాయిలు.. అప్పటికే అక్కడ ఉన్న అబ్బాయిలతో కలిసి బైక్ ఎక్కడికో వెళ్లిపోయారు., అనంతరం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో తిరిగి హాస్టల్ వద్దకు చేరుకుని గోడ దూకి లోపలికి వెళ్లారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. హాస్టల్ విద్యార్థినులు భద్రతపై విమర్శలు వస్తున్నాయి.