అల్లూరి జిల్లాలోని పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఏజెన్సీ ప్రాంతంలో సెల్ ఫోన్ సిగ్నళ్ల సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా సెల్ టవర్లు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సెల్ టవర్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇంటెలిజెన్స్ అధికారులు. దీని ద్వారా గ్రామాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించడంతో పాటుగా మావోయిస్టుల కదలికలు, గంజాయి సాగు, అక్రమ రవాణాపైనా నిఘా ఉంచేందుకు వీలు చిక్కుతుందని అధికారులు చెప్తున్నారు.