సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం జరిగి, 42 మంది యాత్రికులు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్కు చెందినవారేనని ప్రాథమిక సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సహాయక చర్యలకు ఆదేశించారు.