తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో '21వ శతాబ్దం కోసం నాయకత్వం' అనే ప్రత్యేక కోర్సులో చేరనున్నారు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తర్వాత, జనవరి 25 నుంచి 30 వరకు జరిగే ఈ ఇంటెన్సివ్ లెర్నింగ్ ప్రోగ్రామ్లో పాల్గొంటారు. క్లిష్టమైన సమస్యల పరిష్కారం, ప్రజలను ప్రభావితం చేయడం వంటి అంశాలపై శిక్షణ ఉంటుంది.