తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రేవంత్ సర్కార్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈరోజు సాయంత్రం గాంధీభవన్లో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో, బీసీ రిజర్వేషన్ల బిల్లు పెండింగ్లో ఉండటంతో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మంత్రివర్గ సమావేశంలో ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.