వరంగల్, హనుమకొండ స్మార్ట్సిటీ పనులు డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రూ.150 కోట్ల కొత్త పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగిపోయిన రూ.250 కోట్ల పనులను వేగవంతం చేస్తున్నారు. చెరువు సుందరీకరణ, డ్రైనేజీ, లైటింగ్, గ్రీనరీ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులు సూచించారు.