ఒకరేమో అందరూ మంచి వాళ్లే అనుకునేంత అమాయకులు.. మరొకరేమో ఎవరినైనా సరే తనకోసం వాడుకునే స్వార్థపరుడు. అలాంటి ఇద్దరు వ్యక్తులు ఒకరికొకరు ఎదురుపడితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలమా..? తెలివైన స్వార్థపరుడి తేనే పలకులకు అమాయకుడి భయం తోడు కావడంతో.. 2 దశాబ్దాలకుపైగా ఆ అమాయకుడు వెట్టి చాకిరీ చేయాల్సి వచ్చింది. చివరకు సమాజంలోని కొందరు మంచి మనుషులు పూనుకోవడంతో అతడికి బానిసత్వం నుంచి విముక్తి లభించింది. సోషల్ మీడియా పుణ్యమా అని చివరికి ఇంటికి చేరగలిగాడు.