Andhra Pradesh Haj Pilgrims Get Compensation From Airlines: విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి వెళ్లిన హజ్ యాత్రికులకు ఊరట దక్కింది. సకాలంలో లగేజీ చేర్చనందుకు 177 మంది యాత్రికులకు ఫ్లైఏడీల్ ఎయిర్లైన్స్ సంస్థ నష్టపరిహారం చెల్లించింది. ఒక్కొక్కరి అకౌంట్లో రూ.13,800 చొప్పున మొత్తం రూ.24 లక్షల 42 వేల 600లను జమ చేశారు. ఈ విషయాన్ని ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు.