మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదుతో కడప పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఇటీవల విడుదలైన ‘హత్య’ సినిమాలో తన తల్లిని అసభ్యకరంగా చూపించారని అతడు ఆరోపించారు. ఆ సినిమాలో సన్నివేశాలు తమ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, దానిని వెంటనే నిలిపి చేయాలని ఎస్పీకి.. సునీల్ యాదవ్ రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.