ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సంబంధించిన ఒక నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ డీప్ఫేక్ వీడియోలో ఒవైసీ ఒక హనుమాన్ ఆలయంలో హారతి ఇస్తున్నట్లుగా తప్పుగా వక్రీకరించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి.. మతపరమైన అశాంతిని సృష్టించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి.. వీడియోను సృష్టించిన వారిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి నకిలీ వీడియోలను నమ్మవద్దని.. షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.