సంగారెడ్డి జిల్లాలో ఒక రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్ తాగిన యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను సగం తాగిన కూల్ డ్రింక్ సీసాలో బల్లి అవశేషాలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆహార పదార్థాల విషయంలో రెస్టారెంట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.