జగిత్యాల జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్లో విషాదం చోటు చేసుకుంది. గురుకుల పాఠశాల వంటగదిలో వేడి సాంబార్ గిన్నెలో పడి నాలుగేళ్ల బాలుడు మోక్షిత్ మృతి చెందాడు. అదే రోజు అతని పుట్టినరోజు కావడం ఆ కుటుంబానికి దుఃఖాన్ని మిగిల్చింది. మరోవైపు హైదరాబాద్లో టిప్పర్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఈ రెండు ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి.