FSSAI Notice To Heritage Curd: హెరిటేజ్ ఫుడ్స్ ఎపిసోడ్ మరోసారి హాట్టాపిక్ అయ్యింది. పెరుగు విషయంలో కోర్టు జరిమానా విధించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్స్ ఈ అంశంపై స్పందించింది. హెరిటేజ్ సంస్థపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తమ ఉత్పత్తుల తయారీలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తామన్నారు. తమకు వెన్న శాతం తగ్గించే ఉద్దేశమే లేదన్నారు. ఈ మేరకు హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జె సాంబమూర్తి ప్రకటన విడుదల చేశారు.