హైదరాబాద్లో ప్రత్యేక థర్డ్షిఫ్ట్ బస్సులను ప్రారంభించేందుకు గ్రేటర్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. పెరుగుతున్న నైట్లైఫ్, నైట్షిఫ్ట్ ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలి దశలో ఆరు రద్దీ ప్రధాన మార్గాల్లో ఒక్కో మార్గానికి కనీసం ఐదు చొప్పున 30 బస్సులను నడపనున్నారు. రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రయోగాత్మకంగా సేవలు అందించనున్నారు. ప్రయాణికుల స్పందన, ఆక్యుపెన్సీ ఆధారంగా ఇతర మార్గాలకు విస్తరించనున్నారు.