మల్లన్న భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ నెలకు సంబంధించిన స్వామివారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్లను దేవస్థానం ఆధికారులు ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నారు. మంగళవారం నుంచి ఇవి అందుబాటులో ఉంటాయి. 90 శాతం టికెట్లను మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మిగతా టికెట్లను.. ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.