హైదరాబాద్ నగర వాహనదారులకు అలర్ట్. ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరుకానున్నారు. దీంతో కోర్టు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. పోలీసులు పలు మార్గాల్లో ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను లేదా మెట్రోను ఉపయోగించుకోవాలని సూచించారు.