ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం, తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. విద్యుత్ రంగంలో రూ. 562 కోట్ల పెట్టుబడితో రుద్రారంలో అత్యాధునిక సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని టీటీడీఐ ఏర్పాటు చేయనుంది. ఇది రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.