Singareni: అరుదైన లోహాల అన్వేషణ కోసం సింగరేణి సంస్థ హైదరాబాద్లో ఒక అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దీని కోసం ఫ్యూచర్ సిటీలో పది ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. విదేశీ నైపుణ్యం కలిగిన సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు ఈ కార్యాలయం కేంద్రంగా నిలుస్తుంది. బొగ్గు ఉత్పత్తితో పాటు ఖనిజాల వెలికితీత రంగంలోకి అడుగు పెడుతున్న సింగరేణి.. త్వరలోనే భవన నిర్మాణ పనులను మొదలుపెట్టనుంది.