రాష్ట్ర రవాణా వ్యవస్థను ఆధునీకరించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని తెలంగాణ విజన్- 2047 ముసాయిదా లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా.. దాదాపు 90 శాతం ప్రజలు 2 గంటల్లో హైదరాబాద్ ORRకి చేరుకునేలా రవాణా నెట్వర్క్ను విస్తరిస్తారు. ఆర్థిక ప్రాంతాలను బలోపేతం చేస్తూ.. రోడ్లు, రైల్ నెట్వర్క్ను విస్తరించడంతో పాటు, ఆధునిక రవాణా మార్గాలను ఏర్పాటు చేయనున్నారు.