హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళే వారికి శుభవార్త. మీ ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ఖమ్మం-దేవరపల్లి మధ్య నూతన గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణంతో దాదాపు 5 గంటలు ఆదా అవుతాయి. అత్యాధునిక వసతులతో, తక్కువ ప్రవేశ మార్గాలతో ఈ రహదారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. 2026 నాటికి ఈ రహదారి అందుబాటులోకి రానుండగా.. విజయవాడ వెళ్లకుండానే విశాఖ చేరుకోవచ్చు.