హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పాదచారుల భద్రతను పెంచేందుకు స్కైవేలు, ఫుట్ఓవర్ వంతెనల నిర్మాణం వేగవంతమైంది. అత్యధిక రద్దీ ఉండే 21 ప్రాంతాలను గుర్తించి, నివేదిక ఆధారంగా దశలవారీగా పనులు చేపట్టనున్నారు. నిధుల సమస్యను అధిగమించడానికి పీపీపీ విధానంలోనూ నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు.