హైదరాబాద్ నగరవాసులకు గుడ్న్యూస్. ఉప్పల్ తరహాలో భారీ స్కైవాక్ను అందుబాటులోకి రానుంది. ఈ మేరకు UMTA ప్రణాళిక సిద్ధం చేసింది. మెట్రో స్టేషన్, బస్స్టేషన్, లూలూమాల్ వంటి ప్రాంతాలను కలుపుతూ జేఎన్టీయూ జంక్షన్లో పాదచారులకు సురక్షిత ప్రయాణం అందించేందుకు స్కైవాక్ నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ ప్రాజెక్టు పనులు ఈ ఏడాదే ప్రారంభం కానున్నాయి.