ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించని ఇండ్లు, వ్యాపార సముదాయాల యజమానులకు జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పెండింగ్ బకాయులు పూర్తిగా చెల్లించాలన్నారు. లేదంటే ప్రాపర్టీస్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే 100కు పైగా భవనాలు సీజ్ చేశామని.. దాదాపు 6 లక్షల మందికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు చెప్పారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.