హైదరాబాద్ నగరంలో పౌరసేవలు సులభతరం చేస్తూ.. GHMC వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపు సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 50 శాతం పన్నులు ఆన్లైన్లో వసూలవుతుండగా.. ఈ కొత్త విధానంతో మరింత మందికి చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఇది ప్రజలకు సులభతరం చేయడమే కాకుండా జీహెచ్ఎంసీ ఖర్చులను తగ్గించనుంది.