హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. నగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. రేపు (జూన్ 28న), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శేరిలింగంపల్లిలోని శిల్పా లేఅవుట్ ఫేస్-2 వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ను ప్రారంభించనున్నారు. రూ. 182.72 కోట్ల వ్యయంతో, 1.20 కిలోమీటర్ల పొడవైన 6-లైన్ల ఈ బై-డైరెక్షన్తో కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ నగరంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించనుంది.