హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో కిరణ్మయి అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. తన ఫోన్ రీచార్జ్ చేయలేదని సహజీవనం చేస్తున్న ప్రియుడు వెంకటేష్తో గొడవపడి ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. భర్తకు విడిపోయి కుమారుడితో ఉంటున్న కిరణ్మయి.. ఏడాదిగా వెంకటేష్తో కలిసి ఉంటోంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు వెంకటేష్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఫోన్ రీఛార్జ్ కారణమా..? మరేదైనా సమస్యా..? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.