హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిధులు భరించేలా ఆలోచిస్తున్నాయని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. కొత్తగా 160 కిలోమీటర్ల మెట్రో లైన్ల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇక పొరుగు రాష్ట్రం ఏపీలోని విశాఖ, విజయవాడ మెట్రోలపై కూడా పరిశీలన ఉంటుందని, అమరావతి అభివృద్ధికి నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు.