హైదరాబాద్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రీజినల్ రింగ్రోడ్డు నిర్మాణానికి కేంద్రం సిద్ధంగా ఉందని పార్లమెంట్లో కేంద్రమంత్రి గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపిందని.. దీని అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లుగా వెల్లడించారు. ఇప్పటికే డీపీఆర్ పనులు షురూ అయినట్లు వెల్లడించారు.