హైదరాబాద్ రాయదుర్గంలో భూముల ధరలు రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్నాయి. నాలెడ్జ్ సిటీలో ఉన్న 18.67 ఎకరాల భూమిని వేలం వేయడానికి టీజీఐఐసీ సిద్ధమైంది. ఎకరం భూమి ధర రూ.101 కోట్లుగా నిర్ణయించగా.. పలు నిర్మాణ సంస్థలు ఎకరానికి రూ.140 కోట్లకు పైగా చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అక్టోబర్ 6న ఈ వేలం జరగనుంది. ఈ భూములను కొనడానికి దేశీయ, విదేశ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని రియల్టర్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు..