వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ అయ్యారు. మద్యం రవాణా కేసులో కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని నివాసంలో ఆదివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం కారుమూరిని అదుపులోకి తీసుకుంది. అనంతరం బషీర్బాగ్ ఈడీ ఆఫీసుకు తరలించారు. మరోవైపు ఈ కేసులో కారుమూరి తనయుడు సునీల్ జూన్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.