రాష్ట్రాన్ని కుండపోత వానలు వదలడం లేదు. ఆదివారం సాయంత్రం మొదలైన వర్షం రాత్రి వరకు కొనసాగింది. ఇదిలా ఉంటే సోమవారం ఉదయం కాస్త పొడిగా ఉన్న వాతావరణం సాయంత్రానికి మారిపోయింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి నగరంలో భారీ వర్షం మొదలయ్యింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాగల రెండు, మూడు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలానే పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆ వివరాలు..