హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం 'విజన్-2047'తో దూసుకుపోతోంది. మెరుగైన రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణ, పౌర సౌకర్యాలు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై దృష్టి సారించారు. మూసీ నదిని సుందరీకరించి 24 గంటల తాగునీటి సరఫరా లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. హైదరాబాద్ను ఆవిష్కరణలకు, పెట్టుబడులకు కేంద్రంగా తీర్చిదిద్దడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.