హైదరాబాద్ నగరంలో సొంతిల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు మధ్య మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరకే ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఈ ఇళ్ల నిర్మాణం ఉంటుందని అన్నారు.