హైదరాబాద్లో 38వ నేషనల్ బుక్ ఫెయిర్ డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. ప్రకృతి కవి అందెశ్రీ పేరుతో ప్రాంగణానికి నామకరణం చేశారు. 365 స్టాల్స్తో బుక్ ఫెయిర్ ఏర్పాటు కానుండగా.. ఎంట్రీ ఫీజు రూ.10గా డిసైడ్ చేశారు. అయితే విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించారు. ఈసారి కొత్త పుస్తకాల ఆవిష్కరణలు, రచయితలతో ముఖాముఖి, సాంస్కృతిక కార్యక్రమాలు, సెల్ఫీ స్పాట్, ఫుడ్ కోర్టులు ప్రత్యేక ఆకర్షణలు.