హైదరాబాద్ ఉప్పల్లో ఓ వ్యక్తి ఫేక్ స్వాతంత్య్ర సమరయోధుడి హోదాతో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు. ఈ వ్యవహారం దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వెలుగులోకి వచ్చింది. హోంశాఖ రికార్డుల్లో కనకయ్య అనే స్వాతంత్య్ర సమరయోధుడు వివరాలు లేవని తేలింది. రికార్డుల తారుమారుకు సంబంధించిన ఆనవాళ్లను రెవెన్యూ అధికారులు గుర్తించారు. అప్పటికే ఆ భూమిలోని ఏడు ఎకరాల్లో నిర్మాణాలు పూర్తయ్యాయి. దాదాపు 80 నిర్మాణాలు వెలిశాయి. 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూమిపై అనుమతులు ఎలా వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది.