హైదరాబాద్ మెట్రో ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. అదనపు కోచ్ల కొనుగోలు ప్రక్రియను హెచ్ఎంఆర్ఎల్ వేగవంతం చేస్తోంది. కొత్తగా 10 కోచ్లను సమకూర్చాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించగా.. సాంకేతికంగా అనుకూలమైన కోచ్ల ఎంపికపై డీఎంఆర్సీ సహకారం తీసుకోనున్నారు. డీఎంఆర్సీ కన్సల్టెన్సీ కొటేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. దేశీయ తయారీ సంస్థలతోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ. పాతబస్తీ మెట్రో మార్గానికి సంబంధించిన ఆస్తుల సేకరణ తుది దశకు చేరింది.