హైదరాబాద్‌లో మరో 42 ఎకరాల భూమి వేలం.. రూ.5 వేల కోట్లు టార్గెట్, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

1 month ago 5
హైదరాబాద్‌లో మరోసారి భూములు వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మూసాపేట, బంజారాహిల్స్, కొండాపూర్‌లో మొత్తం 42 ఎకరాలను వేలం వేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని ద్వారా సుమారు రూ. 5 వేల కోట్లు సేకరించాలని టార్గెట్‌గా పెట్టుకుంది. దీనికి సంబంధించి హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే గతంలో హైదరాబాద్‌లో జరిగిన భూముల వేలాల్లో రికార్డు ధరలు పలికాయి. దీంతో ఈసారి కూడా భారీ స్పందన వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Entire Article