హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయి. ఏకంగా 12 కిలోల గంజాయి దొరికినట్లు అధికారులు వెల్లడించారు. దీని విలువ రూ.12 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి తీరుపై అనుమానం వచ్చి.. అతని బ్యాగ్ చెక్ చేయగా.. అందులో ప్యాకెట్లు లభించినట్లు తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసి.. ఆ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.