హైదరాబాద్ శివార్లలోని ఆదిభట్ల సమీపంలో ఉన్న నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ బిస్కెట్ కంపెనీ మూతపడటంతో 300 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పార్లే బిస్కెట్స్ సంస్థ ఈ కంపెనీతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో 2025 డిసెంబర్ 1న యాజమాన్యం గేట్లు మూసివేసింది. గత 18 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని.. 45 రోజులు గడుస్తున్నా పెండింగ్ జీతాలు చెల్లించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయాలంటూ హెల్పర్లు, ఆపరేటర్లు, సూపర్వైజర్లు బొంగులూరు వద్ద కంపెనీ ఎదుట ధర్నాకు దిగారు. ఉపాధి కోల్పోయిన తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.